GUNTUR NEWS…ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలు…ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు
రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సమాజ నిర్మాణమే నినాదంతో స్వర్ణాంధ్ర సాధన దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత పాలకుల నిర్వాకంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిందని, ముఖ్యంగా వైద్యరంగం కుదేలైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించే దిశగా కసరత్తు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరులో కిమ్స్ శిఖర ఆస్పత్రి ప్రారంభోత్సవానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ
…మంగళగిరి ఎయిమ్స్కు చుక్క నీరివ్వలేని వారు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047తో 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నామన్నారు.