chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

POLAVARAM NEWS:క్యాన్సర్ మహమ్మారికి చెక్.. ఎల్.ఎన్.డి పేటలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం

  • 14-15 ఏళ్ల పిల్లల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ప్రభుత్వ చర్యలు
  • ముఖ్య అతిథిగా హాజరైన వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బా రాంబాబు
  • విజయవంతంగా నిర్వహించిన డాక్టర్ నిఖిల్, వైద్య సిబ్బంది

పోలవరం (ఏలూరు జిల్లా): ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్తులో పిల్లల దరిదాపుల్లోకి క్యాన్సర్ మహమ్మారి రాకుండా నివారించేందుకు గాను, 14 నుంచి 15 ఏళ్ల వయసున్న పిల్లలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ (టీకా పంపిణీ) కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా, పోలవరం మండల పరిధిలోని ఎల్.ఎన్.డి (L.N.D) పేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

ప్రభుత్వ చొరవ అభినందనీయం.. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పోలవరం నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు గుబ్బా రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలైన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తుగా ఇలాంటి నివారణ చర్యలు చేపట్టడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వ్యాక్సిన్ కార్యక్రమం పిల్లలను ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి నుంచి రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

డాక్టర్ నిఖిల్ మరియు స్థానిక వైద్య సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఆరోగ్య సిబ్బంది, గ్రామ ప్రజలు, విద్యార్థులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.Eluru district local news Telugu latest: ఏలూరు జిల్లా వార్తలు అప్డేట్స్

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker