పల్నాడు జిల్లా ,చిలకలూరిపేట
చిలకలూరిపేట పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ గాదె అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి. గత కొన్ని సంవత్సరాలుగా ఇతను వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం నేటి సూర్య దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్నారు. . అందిన సమాచారం మేరకు పిడుగురాళ్ల నుండి చిలకలూరిపేట వైపు కారులో వస్తుండగా నరసరావుపేట సమీపంలోని రావిపాడు వద్ద కారు చెట్టును ఢీకొనడంతో అంజిరెడ్డి అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు తెలుస్తుంది. అంజిరెడ్డి మృతికి ఏపిజేఎఫ్, పల్నాడు జిల్లా మీడియా అసోసియేషన్, పలు రకాల జర్నలిస్టుల యూనియన్ వాళ్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
శోక సముద్రంలో కుటుంబ సభ్యులు.