Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

charmakarula samasyala: చర్మకారుల సమస్యలపై మంత్రి లోకేష్‌ కు వినతి

మంగళగిరి, నవంబర్ 4: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్‌ నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆంధ్రప్రదేశ్‌ చర్మకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుల్లా రాజారావు చర్మకారుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బుల్లా రాజారావు మాట్లాడుతూ, తాము మంత్రి లోకేష్‌ను కలిసిన ఫోటోలు ఆలస్యంగా అందడం వల్ల గురువారం మీడియాలో వివరాలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని చర్మకారుల అభివృద్ధి కోసం లిడ్ క్యాప్‌కు రూ.300 కోట్లు మంజూరు చేయాలని, 300 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని, అన్ని జిల్లాల్లో లెదర్‌ పార్కులు నిర్మించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా చర్మకారులు, డప్పు కళాకారులకు రెండు లక్షల రూపాయల చొప్పున రుణాలు మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, చర్మకారుల సంక్షేమానికి నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న తన సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం తనకు ‘పద్మశ్రీ’ అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేయాలన్న అంశాన్ని కూడా వినతి పత్రంలో పొందుపరిచినట్లు చెప్పారు.తమ అభ్యర్థనలకు మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారని బుల్లా రాజారావు తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button