Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Chennai- vijayawada:చెన్నై–విజయవాడ ‘వందేభారత్’ నరసాపురం వరకు పొడిగింపు

అమరావతి: చెన్నై సెంట్రల్:–విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపురం వరకు పొడిగిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది. కొత్త మార్గంలో సర్వీసు త్వరలో ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం చెన్నై సెంట్రల్‌ నుంచి ఉదయం 5.30 గంటలకు బయలుదేరే వందేభారత్‌ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా మధ్యాహ్నం 12.10కి విజయవాడ చేరుతుంది. ఇకపై పొడిగించిన సర్వీసు ప్రకారం రైలు 11.45కి విజయవాడ చేరుకొని, 11.50కి బయలుదేరి మధ్యాహ్నం 12.25కి గుడివాడ, 1.30కి భీమవరం, 2.10కి నరసాపురం చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50కి నరసాపురం నుంచి బయలుదేరి, 3.20కి భీమవరం, 4.10కి గుడివాడ, 4.50కి విజయవాడకు చేరుతుంది. అక్కడి నుంచి 4.55కి బయలుదేరి, తెనాలి (5.20), ఒంగోలు (6.30), నెల్లూరు (7.40), గూడూరు (8.50), రేణిగుంట (9.50) మీదుగా రాత్రి 11.45కి చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది.పొడిగించిన ఈ సర్వీసుకు అడ్వాన్స్ రిజర్వేషన్ సదుపాయం కల్పించామని, నరసాపురం స్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి వందేభారత్‌ను ప్రారంభిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రారంభ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.రఘురామ లేఖ.. శ్రీనివాసవర్మ చొరవనరసాపురం మీదుగా వందేభారత్‌ సర్వీసు పొడిగించాలని గతంలో ఎంపీగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేంద్ర రైల్వే మంత్రికి లేఖ రాశారు. ఆ ప్రతిపాదనను ప్రస్తుత నరసాపురం ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసవర్మ ప్రాధాన్యంగా తీసుకొని ప్రత్యేకంగా కృషి చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button