
చిలకలూరిపేట, ఫిబ్రవరి 9:-చిలకలూరిపేటలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన ఆకస్మిక దాడులు ప్రభుత్వ కార్యాలయాల్లో తీవ్ర కలకలం రేపాయి. పంచాయతీ రాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ చార్యులు, ఒక కాంట్రాక్టర్ నుంచి రూ. 24,000 లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కారు.
గతంలో పూర్తి చేసిన కొన్ని కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను మంజూరు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ఏఈను సంప్రదించగా, వాటిని పాస్ చేయడానికి లంచం ఇవ్వాలని సత్యనారాయణ చార్యులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. లంచం డిమాండ్తో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు ముందస్తు ప్రణాళికతో దాడులకు దిగారు.
సోమవారం పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో బాధితుడి నుంచి నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ బృందం దాడి చేసి ఏఈ సత్యనారాయణ చార్యులను అదుపులోకి తీసుకుంది. ఈ ఘటనతో చిలకలూరిపేట ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్కంఠ నెలకొంది.Guntur nagaram lo
ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.










