
బాపట్ల జిల్లా:- ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, చీరాల డీఎస్పీ మోయిన్ గారి సూచనలతో చినగంజాం మండలం జడ్పీహెచ్ఎస్ పెద్ద పల్లెపాలెం పాఠశాలలో సోమవారం విద్యార్థుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని చినగంజాం ఎస్ఐ రమేష్ గారి ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ శక్తి బృందం నిర్వహించింది. శక్తి బృందం ఎస్సై ఏ.హరి బాబు గారు, కానిస్టేబుల్ కే.సుబ్బారావు గారు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శక్తి బృందం ఎస్సై ఏ.హరి బాబు గారు మాట్లాడుతూ శక్తి యాప్ ప్రాముఖ్యతను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు తక్షణ సహాయం పొందేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈవ్ టీజింగ్, బాల్య వివాహాల నివారణలో కూడా శక్తి యాప్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై అవగాహన కల్పిస్తూ, ఎవరి వల్లైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి వేదికలలో వచ్చే ఫేక్ న్యూస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమస్య ఎదురైనప్పుడు 100, 112 హెల్ప్లైన్ నంబర్లకు కాల్ చేస్తే తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వలన కలిగే దుష్పరిణామాలను వివరించారు. డ్రగ్స్ లేదా గంజాయికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే 1972 ఫోన్ నంబర్కు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.Chirala Local News
ఈ కార్యక్రమంలో శక్తి టీం ఎస్సై ఏ.హరి బాబు గారు, పీసీ కే.సుబ్బారావు గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింగాల వెంకటేశ్వర్లు గారు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.










