Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ఎలూరు జిల్లా

Elure Local News:చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా – పెండింగ్ జీతాలు, పీఎఫ్ విడుదల చేయాలని డిమాండ్

ఏలూరు జిల్లా:చింతలపూడి: అక్టోబర్ 14:-ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా జీతాలు లభించకపోవడం, 15 నెలల పీఎఫ్ బకాయిలు ఇప్పటికీ చెల్లించకపోవడంపై నిరసనగా ఆసుపత్రి ఆవరణలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా కార్మిక సంఘం ఏఐటియుసి అనుబంధ శాఖ అధ్యక్షురాలు తొర్లపాటి మరియమ్మ మీడియాతో మాట్లాడుతూ, “కొత్త ఏడాది ప్రారంభంలో కాంట్రాక్టర్ మారాలని పేర్కొనబడినప్పటికీ మళ్లీ అదే కాంట్రాక్టర్‌కే టెండర్ ఇవ్వడం అన్యాయమని” ఆరోపించారు. పాత బకాయిలను విడుదల చేయకుండానే మళ్లీ అదే వ్యక్తికి కాంట్రాక్టు అప్పగించడం వెనుక జిల్లా వైద్యాధికారుల ప్రమేయం ఉందని ఆమె మండిపడ్డారు.

“మూడు నెలల జీతాలు, 15 నెలల పీఎఫ్ బకాయిలు కార్మికుల జీవితాలను దెబ్బతీస్తున్నాయి. వెంటనే బకాయిలు విడుదల చేసి, బాధ్యతాయుతంగా వ్యవహరించని కాంట్రాక్టర్‌ను మార్చాలి,” అంటూ ఆమె ప్రభుత్వాన్ని, వైద్య శాఖ అధికారులను డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో కార్మికులు రాజు, నాగరాజు, కుమారి తదితరులు పాల్గొన్నారు. అధికారులు స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button