ఆంధ్రప్రదేశ్
CM Chandrababu Naidu advised ministers and leaders to clear Telangana’s doubts about the Polavaram-Banakacharla connectivity project.
పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సీఎం చంద్రబాబు మంత్రులు, నేతలకు సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలే వాడుకుంటున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు. సచివాలయంలో రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదు. పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలి. కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉంది.” అని అన్నారు.