గుంటూరుఆంధ్రప్రదేశ్

CM Chandrababu visited Guntur.

Slice Scroll Ad
Ad Image 1 Ad Image 2 Ad Image 3

సీఎం చంద్రబాబు గుంటూరులో పర్యటించారు.
యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా నిర్వహించిన వాకథాన్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అమరావతి రోడ్డులోని ఫీవర్ ఆసుపత్రి నుంచి చిల్లీస్ జంక్షన్ వరకు ప్రదర్శన సాగింది. అనంతరం శ్రీ కన్వెన్షన్ లో విద్యార్థులు, యువతతో ముఖాముఖి నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ప్రసంగించారు. డ్రగ్స్ కి అలవాటు పడితే యువత జీవితం అంధకారం అవుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. గంజాయి, డ్రగ్స్, మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఈగల్ వ్యవస్థ ద్వారా
పటిష్టమైన చర్యలు చేపడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో
కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, హోం మంత్రి వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker