అన్న ఎన్టీఆర్ గారిది మరణం లేని జననం.
-మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు.
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడిలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణలు.
ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 18.01.2025.
తెలుగుదేశం పార్టీ ప్రపంచవ్యాప్తంగా కోటి సభ్యత్వాలకు పైగా నమోదుతో అన్న ఎన్టీఆర్ గారికి మనం ఇస్తున్న ఘనమైన నివాళి ఇదే అంటూ మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం మండలం కొటికలపూడి గ్రామంలో గౌరవ విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శివనాథ్ (చిన్ని) గారు, అన్న ఎన్టీఆర్ గారి 29వ వర్ధంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి రెండు విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో మైలవరం సభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జై టిడిపి అంటూ నినదించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ గారు పేదల అభ్యున్నతికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో రికార్డులు సృష్టించిందన్నారు.
అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అన్న ఎన్టీఆర్ గారు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.
అన్న ఎన్టీఆర్ గారిది మరణం లేని జననం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరి హృదయాల్లో చిరస్థాయిగా ఆయన చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. అటువంటి మహోన్నత నేత విగ్రహాన్ని కొటికలపూడిలో ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొటికలపూడి గ్రామాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం గోకులాన్ని ప్రారంభించారు. ముందుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, బీజేపీ మైలవరం నియోజకవర్గ ఇంచార్జి నూతులపాటి బాలకొటేశ్వరరావు (బాల) గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.