Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
📍ఎలూరు జిల్లా

Eluru local news:జిల్లాలో ఎరువుల కొరత లేదు.. ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కలిగించాలి.

అధికారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం

జిల్లాలో యూరియాను నిరంతరం రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం సరఫరా చేస్తుందనే విషయాన్నీ క్షేత్రస్థాయిలో రైతులకు వ్యవసాయశాఖ అధికారులు స్పష్టంగా అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎరువుల లభ్యత, సరఫరాలపై వ్యవసాయాధికారులతో గురువారం కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా రైతులు రబీ అవసరాలకు కూడా ఇప్పటినుండే యూరియాను కొనుగోలు చేసి నిల్వ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, దారి మళ్లించినా, అధిక ధరలకు అమ్మినా అట్టి డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వ్యవసాయాధికారులు గ్రామ స్థాయి అధికారుల వరకు అందరూ రైతుల యూరియా అవసరాలను గుర్తించి దఫా, దఫాలుగా వారికి సరఫరా చేసే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు.ఎప్పుడూ సంవత్సరం పొడుగునా ఎరువులు నిల్వలు సరఫరా అవుతాయని చెప్పారు. యూరియా తాడేపల్లిగూడెం రేక్ పాయింట్ నుండి రేక్ ఆఫీసర్ వారు జాగ్రత్తగా మండలాలకు, గ్రామాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

యూరియా సరఫరాపై తప్పుడు వదంతులు వ్యాప్తి చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు వదంతులను నమ్మవద్దని, ప్రభుత్వం రైతులకు యూరియాను అందుబాటులో ఉంచిన వివరాలను రైతులకు వ్యవసాయాధికారులు తెలియజేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో రెండు వేల టన్నుల యూరియా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెం నుండి 500 టన్నుల యూరియా ఏలూరు జిల్లాకు కేటాయించడం జరిగిందని, అదికూడా రేపు సాయంత్రం డీలర్లకు లారీల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రైతులందరికీ ఎరువులు అవసరమైన ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని, మోతాదుకు మించిన ఎరువులు రైతులు వినియోగించకుండా, ఎరువుల అధిక వినియోగం వలన కలిగే అనర్దాలను రైతులకు తెలియజేయాలన్నారు. జిల్లాలో అవసరమైన ఎరువులు నిల్వలు ఉన్నాయని, ఎటువంటి ఆందోళన చెందవద్దని రైతులకు అవగాహన కలిగించాలని వ్యవసాయాధికారులు కలెక్టర్ ఆదేశించారు. కల్తీ ఎరువుల బారిన రైతులు పడకుండా గుర్తింపు పొందిన దుకాణాలలో మాత్రమే కొనుగోలు చేసి బిల్లులను తప్పనిసరిగా అడిగి తీసుకొవాలని రైతులకు తెలియజేయాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, మండల, గ్రామ స్థాయి వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.


Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button