Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్

COWE AP new executive committee swearing-in ceremony: నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

  • మహిళా సాధికారతే లక్ష్యంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COWE) కోవె కార్యాచరణ
  • స్వర్ణాంధ్ర 2047 కు అనుగుణంగా ప్రతీ ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త
  • చేనేత మహిళా కార్మికులకు ఆరోగ్య పరిక్షల కొరకు హెల్త్ కార్డు మంజూరు దిశగా కోవె ఆలోచనలు
  • కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (COWE) ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ విజయవాడ లోని మినర్వా గ్రాండ్‌లో గురువారం కొత్త కార్యవర్గంతో ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని కోవే జాతీయ కార్యదర్శి శ్రీమతి అపర్ణ మరియు జాతీయ సహాయ కార్యదర్శి రాధికా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.
  • ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జౌళి మరియు చేనేత శాఖ కమిషనర్ శ్రీమతి రేఖా రాణి మాట్లాడుతూ మహిళా సాధికారతకు , వ్యాపార అభివృద్ధికి , కోవె చేస్తున్న నిరంతర కృషి ప్రశంసినీయమన్నారు. ప్రత్యేకంగా AP చాప్టర్ యొక్క దూరదృష్టి గల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఇది మహిళ సాధికారత సమాక్య అనడం కంటే అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని కృషి చేస్తున్న మహిళల యొక్క నమ్మకాన్ని సాధించే సంస్థ అని కొనియాడారు. కోవె సంస్థ మహిళా వ్యాపారవేత్తల అభివృద్ధికి అందిస్తున్న తోడ్పాటులో ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందన్నారు. మహిళా చేనేత కార్మికుల ఆరోగ్య పరిక్షల కొరకు హెల్త్ కార్డ్స్ వంటి సదుపాయాలను కల్పించాలని దానికి ప్రభుత్వ సహకారం కూడా ఉంటుందని ఆమె అన్నారు. స్వచ్చాంధ్ర లో భాగంగ చేనేత మరియు టైలర్ దగ్గర మిగిలిన క్లాత్ ముక్కలను ఉపయోగించి సంచుల తయారీ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రభుత్వం దీనికి సంబంధించిన వస్తు సామాగ్రిలను, యంత్రాలను కొనుగోలులో రాయితీ అందచేస్తుందని తెలిపారు. ఇదే కాకుండా ప్రభుత్వం మహిళా వ్యాపారవేత్తలకు అందచేస్తున్న పలు సదుపాయాలను రాయితీలను కోవె వారి సభ్యులకు తెలియపరిచి వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. చేనేతకు రాబోయే రోజుల్లో మరింత ప్రాముఖ్యం పెరగనుందని, కోవె సంస్థ ద్వారా భవిష్యత్తు లో చేనేత క్లస్టర్ల స్థాపన కు సహకరిస్తామని తెలిపారు. ప్రస్తుతం “చేనేత రథం” అనే ఉపాది హామీ పథకం ద్వార నేరుగా నేతన్నల నుండి ఉత్పత్తులను వాహనాలలో నగరం లోని వీదులలో, అపార్ట్మెంట్ ల వద్ద విక్రయాలను జరిపే కార్యక్రమం చేపట్టామన్నారు. దీనికి ప్రభుత్వ సహకారం తో పాటు పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువ ఉండటం వలను అటు నేతన్నలు ఇటు విక్రయదారులు కూడా ఈ పథకం పట్ల ఆసక్తి చూపుతున్నారని, కోవె సంస్థ ద్వారా ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని, ఆసక్తి ఉన్న వారు జౌళి మరియు చేనేత శాఖ వారిని సంప్రదించాలని కోరారు. వీటితో పాటు సాధికారత అంటూ మహిళలు తమ ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తున్నారని, ప్రతీ మహిళా తనకోసం కొంత సమయం కేటాయించుకోవాలని అప్పుడే ఒక మహిళా వారి కుటుంబానికి ఆదర్శంగా నిలబడగలదని అన్నారు. చివరగా పలు మహిళా వ్యాపార వేత్తలతో కమీషనర్ రేఖా రాణి ముఖాముఖి మాట్లాడారు.
  • అనంతరం ఏపీ కోవె చాప్టర్ నూతన అధ్యక్షురాలు గా శ్రీమతి యార్లగడ్డ గీతా శ్రీకాంత్ , కార్యదర్సులుగా , విజయలక్ష్మి , జయలక్ష్మి , కోశాధికారిగా యాళ్ల పద్మలత ప్రమాణ స్వీకారం చేశారు . ఎగ్జిక్యూటివ్ కమీటీ గా శోభ రాణి , స్వాతి చంద్ర ,కోడాలి కవిత ,శ్రావణి జెట్టి , లక్ష్మి సుజన , అడ్వైసరి కమిటీ గా మోహిని దేవి , మాలతి , రాజమణి , శ్రీదేవి భాద్యతలు స్వీకరించారు.
  • కోవె ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ నూతన అధ్యక్షురాలు యార్లగడ్డ గీతా శ్రీకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో మహిళా వ్యాపారవేత్తలను అభివృద్ధి పరిచే దిశగా కోవె బృంద సభ్యులందరు కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా ప్రతీ ఇంటినుండి ఒక వ్యాపారవేత్త రావాలన్నారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో వ్యాపార అభివృద్ధి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగానే కోవె ప్రతిష్టాత్మక కార్యక్రమం అయినటువంటి “ పౌష్టిక్ “ కార్యక్రమం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు 2000 మంది మహిళలకు తృణ ధాన్యాల ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వడం జరిగిందని దీని వలన వారికి స్వయం ఉపాధి పొందే అవకాశం ఏర్పడిందని తెలిపారు. యువ మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించే దిశగా కాలేజీ యాజమాన్యాలతో సంప్రదించి పలు కళాశాలల్లో ఇన్కుబేషన్ సెంటర్లను స్తాపించి మహిళా విద్యార్తులకు వ్యాపారం పట్ల మక్కువ పెరిగేలా ప్రోత్సాహం, వ్యాపార నైపుణ్యాలను పెంచడానికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా ఆర్థికంగా పురోగతి సాదిస్తేనే తన కుటుంబం తద్వారా సమాజం వృద్దిలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
  • ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా ఎంఎస్ఎంఇ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి. సుదర్శన్ బాబు, డిప్యూటీ జనరల్ మేనేజర్, నాబార్డ్ మురారి మోహన్ బెహరా, AP ఛాంబర్ ప్రెసిడెంట్ పోట్లురి భాస్కర రావు పాల్గొన్నారు . వీరందరూ భవిష్యత్తు లో కోవె తో కలిసి మహిళల వ్యాపార అభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, వారి వ్యాపార అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందిస్తామని తెలిపారు.

Author

  • COWE AP new executive committee swearing-in ceremony: నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం

    Rambabu K. is a senior Telugu journalist and the Bureau Chief of City News Telugu. Beginning his career in 1998, he has worked with leading media houses such as Eenadu, Sakshi, and Vaartha. With over 25 years of experience, Rambabu blends powerful reporting with innovative marketing strategies that strengthen local and digital journalism. Along with his editorial leadership, he plays a key role as a journalists’ union leader, actively advocating for press freedom, fair working conditions, and ethical reporting standards.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button