chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

దాదాసాహెబ్ ఫాల్కేఅవార్డు సూపర్ స్టార్ కృష్ణకు ఇవ్వాలనిరాష్ట్ర అధ్యక్షుడు సుధా స్వామి కోరారు.

విజయవాడ, అక్టోబర్ 12:సినీ జగత్తులో తనదైన ముద్ర వేసిన తెలుగు సినీ గాయకుడు, నటుడు సూపర్ స్టార్ కృష్ణకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, రాష్ట్ర అభిమాని సంఘ అధ్యక్షుడు, సీనియర్ అభిమాని సుధా స్వామి కీలక విజ్ఞప్తి చేశారు.

దాదాసాహెబ్ ఫాల్కేఅవార్డు సూపర్ స్టార్ కృష్ణకు ఇవ్వాలనిరాష్ట్ర అధ్యక్షుడు సుధా స్వామి కోరారు.

శనివారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం గాంధీనగర్‌లో ఐదు రాష్ట్రాల సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధా స్వామి మాట్లాడుతూ – “సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలు అపూర్వమైనవి. ఆయన్ను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించడం ద్వారా భారత ప్రభుత్వం అతనికి తగిన గౌరవం అర్పించినవారవుతారు,” అని పేర్కొన్నారు.

కృష్ణ జీవితాంతం తన అభిమానులకు అండగా నిలిచారని, ఎంతోమంది పేదలకు భరోసా ఇచ్చారని తెలిపారు. ఆయన తనయుడు మహేష్ బాబు కూడా ఆరోగ్య సేవలలో ప్రజలకు వినూత్న సేవలు అందిస్తున్నారని, ఇప్పటివరకు అనేక హార్ట్ ఆపరేషన్లు ఉచితంగా నిర్వహించి ప్రజల మనసులో స్థానం సంపాదించారని గుర్తు చేశారు.

ఈ అవార్డు కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సుధా స్వామి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ అంశంపై చొరవ చూపాలని కోరినట్టు తెలిపారు.

సదస్సులో ఐదు రాష్ట్రాల నుండి వచ్చిన కృష్ణ, మహేష్ అభిమానులకు ప్రత్యేక అవార్డులు బహుకరించారు. పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమం హృద్యంగా కొనసాగింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker