Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Bapatla Local News :ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల నుంచి బ్యాంకు పూచికతలు తప్పనిసరి-కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి

బాపట్ల :26-11-25:-ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల నుంచి బ్యాంకు పూచికతలు తప్పనిసరి అని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో పౌర సరఫరాల శాఖ, పౌరసరఫరా సంస్థ అధికారులు, తహసిల్దారులతో వీడియో హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించిన కలెక్టర్, ఈ వ్యవహారంపై కీలక సూచనలు జారీ చేశారు.ధాన్యం కోత సమయంలో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 74 రైస్ మిల్లులు ఉండగా, అన్ని మిల్లర్లూ బ్యాంకు పూచికతలు సమర్పించడం తప్పనిసరి అన్నారు. రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరణకు అనుగుణంగా సుమారు రూ.200 కోట్లు పూచికతలు రావాలని ఆదేశించారు.

ప్రతి రైస్ మిల్లులో తేమ కొలిచే యంత్రాలు తప్పనిసరిగా ఉండాలని, అధికారులంతా చిత్తశుద్ధితో పనులు నిర్వహించాలని కలెక్టర్ హెచ్చరించారు. “జీతాలు తీసుకుంటున్నామన్న మనస్తత్వం ఉన్నా సరే, ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం అంగీకారించేది లేదు” అని స్పష్టం చేశారు. సేకరణలో పురోగతి లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరికా సంకేతాలు ఇచ్చారు.రైతులకు మేలు జరిగేలా సేకరణ ప్రక్రియను మరింత సమర్ధంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్లు, టాస్క్‌ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ కమిటీల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లోపాలను గుర్తించి వెంటనే సరిచేయాలని సూచించారు.సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి అమీర్ బాషా, పౌరసరఫరా సంస్థ జిల్లా మేనేజర్ శివ పార్వతి, ఆర్డీవోలు, తహసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker