chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
తెలంగాణ📍 హైదరాబాద్ జిల్లా

ధర్నాలో ఆవేదన, డిమాండ్లతో CPI నేతలు

సికింద్రాబాద్, సెప్టెంబర్ 22: వరుస వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన పేద ప్రజలకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సీపీఐ ఆధ్వర్యంలో మారేడ్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట CPI నేతలు ఇవాళ బహిరంగ ధర‍్ణా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “తీవ్ర వర్షాల కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అనేక ఇళ్లకు నీరు చేరింది. ఆస్తి నష్టం భారీగా జరిగింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడం శోచనీయమైన విషయం,” అని విమర్శించారు.

నష్టపోయిన ప్రతి పేద కుటుంబానికి కనీసం ₹25,000 నష్టపరిహారం అందించాలని, పూర్తిగా ధ్వంసమైన ఇళ్లకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు తక్షణ పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ధర్నాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ కష్టాలు విన్నవించారు. CPI నాయకులు ప్రభుత్వం తక్షణ స్పందన లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker