Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ విజయవాడ

దసరా ఉత్సవాల సందర్భంగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన నగర పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., దంపతులు

విజయవాడ, సెప్టెంబర్ 21: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా ఘనంగా కొనసాగింది.

నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్., సతీమణి సమేతంగా సెప్టెంబర్ 22న సాయంత్రం సమయంలో అమ్మవారికి చీరా, సారెను సమర్పించారు.

ఈ సందర్భంగా ముందుగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఉన్న రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, మేళతాళాలతో అంగరంగ వైభవంగా ఊరేగింపు చేపట్టారు. అనంతరం దేవస్థానానికి చేరుకున్న పోలీస్ కమీషనర్ దంపతులను ఈవో శ్రీ శీనానాయక్, ఆలయ వేదపండితులు మరియు వైదిక కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతించారు.

వేద మంత్రోచ్చారణల నడుమ పోలీస్ కమీషనర్ గారు సతీ సమేతంగా అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ వేడుకలో డీసీపీలు కె.జి.వి. సరిత, తిరుమలేశ్వర రెడ్డి, ఉదయరాణి, ఇతర ఏడీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఇదే కార్యక్రమం శరన్నవరాత్రుల ప్రారంభానికి నాంది పలుకుతూ, నగర పోలీస్ విభాగం తరఫున అమ్మవారికి సమర్పించిన వినమ్ర నివాళిగా అభివర్ణించబడింది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button