Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్ఆరోగ్యం📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

దీర్ఘకాల వ్యాధులకు దివ్య ఔషదం ఆయుర్వేదం సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానమే ఆయుర్వేద ఔషదం

విజయవాడ 15 -09-2025:సైడ్ ఎఫెక్ట్స్ లేని వైద్య విధానమే ఆయుర్వేద ఔషద సేవనమని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నిర్మలా జ్యోతి బాయి అన్నారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవంను పురష్కరించుకుని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ నగర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రన్సిపాల్ నిర్మలా జ్యోతి బాయి మాట్లాడుతూ నేటి స్పీడ్ యుగంలో ముఖ్యంగా యువత విపరీతమైన వత్తిడికి గురవుతున్నారని, వారి వత్తిడిని సహజ పద్ధతిలో తొలగించి ప్రశాంత జీవనం సాగించే వైద్యం ఆయుర్వేదంలో ఉందన్నారు. తక్కువ ఖర్చుతో ప్రాణాంతకమైన, దీర్ఘకాల వ్యాధులను సైతం సులువుగా తగ్గించే విధానం ఆయుర్వేద వైద్య ప్రత్యేకత అని తెలిపారు. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే వన మూలికల తో వ్యాధులను నయం చేసే ప్రక్రియే ఆయుర్వేదమని అన్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 23న జాతీయ ఆయుర్వేద దినోత్సవం ను ఘనంగా జరుపుకుంటామని వివరించారు. జాతీయ ఆయుర్వేద దినోత్సవంలో భాగంగా సోమవారం నుండి ఈ నెల 23 వరకు రోజూ వినూత్న కార్యక్రమాలు నిర్వహించి ఆయుర్వేద చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. ఇందులో భాగంగా మంగళవారం కృష్ణ లంకలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నామని, కళాశాల ఆవరణలో ఆయుర్వేదంపై అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే కళాశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేస్తామన్నారు. ఈ నెల 23న కళాశాల ఆవరణలో ధన్వంతరీ హోమం, పూజాధికార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker