Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ఎన్టీఆర్ విజయవాడ

దూరప్రాంత భక్తులకు దర్శన అవకాశం కలిగేలా స్థానికులు సహకరించాలి: దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)

విజయవాడ, సెప్టెంబర్ 23:దుర్గగుడి చైర్మన్‌గా ఇటీవల నియమితులైన బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మంగళవారం అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, దూరప్రాంతాల నుంచి మాత్రమే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కాళేశ్వరదుర్గమ్మ అమ్మవారి దర్శనార్థం వస్తున్నారని తెలిపారు.

అయితే, స్థానికులు తరచుగా దర్శనానికి రావడం వల్ల, వీరికి దర్శనం సాధ్యం కావడం కష్టంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, దూరప్రాంత భక్తులకు అవకాశం కల్పించేలా స్థానికులు సహకరించాలని సూచించారు.

వీఐపీల విషయంలో కూడా ఆయన స్పందించారు. ఒకరికి పదే పదే పాసులు జారీ చేయకుండా, కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

దుర్గగుడి చైర్మన్‌గా తనను నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం గంటలోపు ఉచిత దర్శనం పూర్తవుతోందని, దీంతో సామాన్య భక్తులు సంతృప్తి చెందుతున్నట్లు వెల్లడించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button