chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

DHUGGIRALA NEWS:దుగ్గిరాలలో వైఎస్ఆర్సీపీ నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభం

దుగ్గిరాల: మండల కేంద్రమైన దుగ్గిరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని గురువారం సాయంత్రం అత్యంత వైభవంగా ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ మంత్రి మరియు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఆప్కో చైర్మన్ చల్లపల్లి మోహన్ రావు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. మండల పార్టీ అధ్యక్షులు తాడిబోయిన శివ గోపయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, తొలుత అర్చకులు రామనాథం వేదమంత్రోచ్చారణల మధ్య అతిథులకు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలికారు.

అనంతరం నేతలు రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి ప్రవేశించారు. శాస్త్రోక్తంగా టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులను పుష్పగుచ్ఛాలతో అభినందించి, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్ర ముక్కు వేణుగోపాల స్వామి రెడ్డి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమర నాగయ్య, మహిళా విభాగ అధ్యక్షురాలు ఫిలోమి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ బాజీ, గంపల గంగాధర్, కొప్పుల శ్రీనివాసరావు, షేక్ సుభాని, మల్లవరపు నాగరాజు, కొండూరు సుమన్, షేక్ జానీ భాష, పిల్లి ధర్మరత్నం, మత్తే ఆనంద్, నూతక్కి కోటేశ్వరరావు, రాము, ఇత్తడి రమేష్‌లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.http://GUNTUR NEWS

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker