Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్వాతావరణం📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Dhisamarchukunna దిశమార్చుకున్నమొంథా’ తుఫాన్

Ntr vijayawada:28-10-25;-అందిన సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ దిశను మార్చుకున్నట్లు తెలుస్తోంది. తాజా వివరాల ప్రకారం తుఫాన్ కోనసీమ జిల్లా అంతర్వేదిపాలెం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరో 3-4 గంటలు అత్యంత కీలకమైన సమయంగా అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ పూర్తిగా తీరాన్ని దాటడానికి సుమారు 6 గంటలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ‘మొంథా’ తుఫాన్ ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని తుఫాన్ ప్రభావిత ఏడు జిల్లాల్లో ఈరోజు రాత్రి 8:30 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది

ప్రభావిత జిల్లాలు:
కృష్ణా, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు, రంపచోడవరం డివిజన్లు.రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) హెచ్చరికల మేరకు ఈ ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అధికారులు ప్రజలను అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button