Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Ditwah thupaanu :దిత్వాహ్ తుపాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

బాపట్ల : దిత్వాహ్ తుపాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం సంపూర్ణ సిద్దతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సూచించారు. శనివారం జిల్లా, డివిజన్, మండలాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్, తాజా పరిస్థితులపై సమీక్ష చేపట్టారు.మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తుపాను ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాటే అవకాశముండటంతో, బాపట్ల జిల్లాపై కూడా ప్రభావం ఉండొచ్చని కలెక్టర్ హెచ్చరించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Ditwah thupaanu :దిత్వాహ్ తుపాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి,

వర్షపాతం అధికమైతే పంటకాల్వలు గండ్లు పడే అవకాశం ఉండటంతో, అవసరమైన ఇసుక బస్తాలు ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కల్వర్టుల వద్ద పూడికతీత పనులు నిర్వహించాలని, గుర్రపుడెక్కలను తొలగించాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువులు, కాల్వలు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.భారీ వర్షాలకు విద్యుత్ లైన్లు లేదా స్తంభాలు దెబ్బతింటే వెంటనే స్పందించేలా విద్యుత్ శాఖను అప్రమత్తం చేశారు. తాగునీటి వనరులు కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, మంచినీటి పథకాల వద్ద విద్యుత్ అంతరాయం రాకుండా చూడాలని సూచించారు. నిత్యవసర సరుకులు నిల్వ ఉంచాలని పౌరసరఫరాల శాఖను దిశానిర్దేశం చేశారు.ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టితో పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన నివేదిక అందించాలని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో అధికారులు తమ మొబైళ్ళు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.సమీక్షా సమావేశంలో డి ఆర్ ఓ జి. గంగాధర్ గౌడ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker