Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur News:డాక్టర్ అబ్దుల్ కలాంకు ఘన నివాళులు అర్పించిన కలెక్టర్

గుంటూరు, అక్టోబర్ 15:భారత మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఘనంగా నివాళులు అర్పించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “అబ్దుల్ కలాం సామాన్య కుటుంబం నుంచి బయటపడి అత్యున్నత పదవిని అలంకరించిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం యువతకు మార్గదర్శకంగా నిలిచింది. శాస్త్రవేత్తగా దేశానికి చేసిన సేవలు అమోఘం. ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా ఆయన జయంతిని జరపడం గర్వకారణం” అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కలాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ఎస్ కే ఖాజావలి, కలెక్టరేట్ ఏవో పూర్ణచంద్రరావు, సెక్షన్ సూపరింటెండెంట్లు మల్లేశ్వరి, కళ్యాణి తదితర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button