గుంటూరు

గుంటూరు:ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో

గుంటూరు:ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PMVBRY) పై అవగాహన కార్యక్రమం గుంటూరులో డివిజనల్ రైల్వే కార్యాలయం నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి. గోపాల్ సింగ్ అధ్యక్షత వహించి, పథకంలోని ముఖ్యాంశాలు, ఉద్యోగులు–యజమానులకు కలిగే ప్రయోజనాలు, అలాగే UAN జనరేషన్ పై వివరించారు.గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీమతి సుధేష్ణ సేన్ పాల్గొని, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమె భవిష్యనిధి సంస్థతో పాటు PMVBRY పథకం ప్రాముఖ్యతను వివరించి, ఉద్యోగుల ప్రయోజనాలను ప్రశంసించారు.
ఈ పథకం కింద ప్రభుత్వం యజమానులకు ఆర్థిక సబ్సిడీలు అందించడం ద్వారా కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇస్తుంది. 2025 ఆగస్టు 1 నుండి 2027 జూలై 31 వరకు ఈ పథకం అమల్లో ఉంటుందిని తెలిపారు.
కార్యక్రమంలో PF సిబ్బంది, DRM కార్యాలయ సిబ్బంది, రైల్వే కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపులో యజమానులు మరియు ఉద్యోగుల సందేహాలకు అధికారులు సమాధానమిచ్చారు.

Authors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker