ఆంధ్రప్రదేశ్ఏలూరు

ELURI NEWS: భారీ వర్షాల కారణంగా అధికారులను అప్రమత్తం చేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారధి

MINISTER PARDHASARADHI

అకాల వర్షాలు కారణంగా అధికారులను అప్రమత్తంగాఉండాలని, పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆదేశించారు. జిల్లాలో ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో అకాల వర్షం కారంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్టమైన భద్రత చర్యలు, సహాయ సహకార కేంద్రాలు, నివారణ చర్యలు చేపట్టాలనీ అధికారులను ఆదేశించారు. జిల్లా ,మండల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్, మెడికల్,అగ్రికల్చర్, ఇరిగేషన్,పంచాయతీరాజ్, ఆర్&బి, అధికారులందరూ సమన్వయంతో పని చేసి నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ అంతరాయం, త్రాగునీరు,సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు, నూజివీడు నియోజకవర్గంలో హార్టికల్చర్ ,మామిడి పంట నష్ట వివరాలు పూర్తి నివేదిక సమర్పించాలన్నారు,అవసరం మేరకు మెడికల్ క్యాంపులు, ఏర్పాటు చేయలన్నారు, ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు, రహదారుల అంతరాయం తక్షణమే నివారించాలన్నారు, అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు,

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker