Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍బాపట్ల జిల్లా

Empowering Bapatla: Collector’s FocusKeyword Initiative||బాపట్ల సాధికారత: కలెక్టర్ యొక్క FocusKeyword కార్యక్రమం

Empowering Bapatla: Collector's FocusKeyword Initiative||బాపట్ల సాధికారత: కలెక్టర్ యొక్క FocusKeyword కార్యక్రమం
     ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజాంపట్నంలోని మేకల శోభారాణి ఇంటికి జిల్లా కలెక్టర్ వెళ్లి పింఛన్ నగదు అందజేశారు.
       ప్రజల కొరకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. సదరు లబ్ధిదారురాలైన శోభారాణితో కలెక్టర్ మాట్లాడారు. తాగునీటి కొరకు ఇబ్బందులు పడుతున్నామని ఆమె కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

     అరటి బోదెలతో గృహ ఉపకారణాలు తయారు చేస్తున్న మహిళలతో కలెక్టర్ మాట్లాడారు. తుపాను షెల్టర్లులో అరటి బోదెలతో గృహ ఉపకారణాల తయారీపై శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడారు.  ఒక స్వచ్ఛంద సంస్థ సహకారంతో అనంతపురం నుంచి అరటి బోదెలు తెప్పించుకుని వివిధ రకాల వస్తువులను తయారుచేయడాన్ని ఆయన పరిశీలించారు. సుగంధ పరిమళాలు వెదజల్లే కొవ్వొత్తులను తయారు చేయడంలో వారి ఆసక్తిని చూసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ స్వయంగా రూ.500లకు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆరా తీశారు.

     వరి పంట సాగు చేసిన రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయశాఖ సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. నిజాంపట్నంలోని రైతు సేవ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు గోనె సంచులు, టార్పాలిన్ పట్టలను ఉచితంగా పంపిణీ చేశారు. వర్షానికి పడవకుండా ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. భారీ వర్షాల హెచ్చరికలతో అత్యవసరంగా గోదాములను గుర్తించామని రైతులకు తెలిపారు. అన్ని ప్రాంతాలలో గోదాములు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. నిజాంపట్నంలో 30 ట్రాక్టర్లను రైస్ మిల్లులకు అనుసంధానించామని, ధాన్యం  కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను రైతులు తెచ్చుకోవచ్చన్నారు. వాటికి జిపిఎస్ అమర్చాల్సి ఉందన్నారు.  రైతులు వరి పంట కోసిన తర్వాత వర్షానికి తడవకుండా భద్రంగా ఉంచుకోవాలన్నారు. తదుపరి తేమ 17 శాతానికి రాగానే రైతు సేవా కేంద్రాలలో అమ్ముకోవచ్చన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

      ఆయన వెంట రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, తహసిల్దార్ శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker