Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍ప్రకాశం జిల్లా

Prakasam Local news:ఇంకొల్లులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌ను ప్రారంభించిన- ఎమ్మెల్యే ఏలూరి

ఇంకొల్లు, నవంబర్ 8 :-ఇంకొల్లు పట్టణంలో నూతనంగా నిర్మించిన ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌ను శనివారం ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు ఆస్పత్రి యాజమాన్యం పూర్ణకుంభ స్వాగతం పలుకుతూ వేదపండితుల ఆశీర్వచనాలతో ఆహ్వానించింది. అనంతరం ఎమ్మెల్యే ఏలూరి, హాస్పిటల్ ఎండి డాక్టర్ పోతిన రమేష్ బాబుతో కలిసి ఆస్పత్రిలో పలు విభాగాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా సభలో ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ –“గ్రామీణ ప్రజల చెంతకే కార్పొరేట్ వైద్యం చేరడం అభినందనీయం.

Prakasam Local news:ఇంకొల్లులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌ను ప్రారంభించిన- ఎమ్మెల్యే ఏలూరి

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఇంకొల్లులో బ్రాంచ్‌ను ప్రారంభించడం సంతోషకరం” అని పేర్కొన్నారు. అనేక దశాబ్దాలుగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సామాన్యులకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తూ విశ్వాసాన్ని పొందిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్పిటల్ సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు.అలాగే ఆయన, ఆస్టర్ రమేష్ హాస్పిటల్ సీఎస్ఆర్ ఫండ్ కింద ఈ ప్రాంతంలోని ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.

Prakasam Local news:ఇంకొల్లులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్‌ను ప్రారంభించిన- ఎమ్మెల్యే ఏలూరి

హాస్పిటల్ ఎండి డాక్టర్ పోతిన రమేష్ బాబు మాట్లాడుతూ –“ఇంకొల్లు పరిసరాల్లో క్వాలిటీ మెడికల్ సర్వీసుల కోసం ప్రజలు చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఆధునిక పరికరాలు, నిపుణుల వైద్య సేవలతో ఆస్పత్రిని విస్తరించాం. గ్రామీణ ప్రాంత ప్రజలకు సరసమైన ఖర్చుతో అత్యుత్తమ చికిత్స అందించడం మా లక్ష్యం” అని అన్నారు. ఎమ్మెల్యే సూచనల మేరకు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, నాయుడు హనుమంతరావు, కర్రి శ్రీనివాసరావు, బోడెంపూడి సుబ్బారావు, సాంబయ్య, అలాగే ఆస్టర్ రమేష్ హాస్పిటల్ యాజమాన్యం మమత, కార్తీక్, భరత్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button