chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా

Exit polls phalithalu:ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మా సంస్థ స్మార్ట్ పోల్స్ చెప్పినట్టుగానే వచ్చాయి – సంస్థ ప్రతినిధి నూకల శ్రీనివాసరావు

విజయవాడ :14-11-25:- జాతీయ, రాష్ట్రస్థాయి ఎన్నికలపై తమ అంచనాలు మరోసారి నిజమయ్యాయని స్మార్ట్ పోల్స్ సంస్థ ప్రతినిధి నూకల శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తమ సంస్థ ముందుగానే వెల్లడించిందని, అదే విధంగా ఫలితాలు వెలువడ్డాయని తెలిపారు. మూడు దశాబ్దాలుగా విజయవాడను కేంద్రంగా చేసుకుని రాజకీయ సర్వేలు నిర్వహిస్తున్నామని, అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలలో ఎక్కువ శాతం ఫలితాలు వాస్తవానికి దగ్గరగా వచ్చాయని శ్రీనివాసరావు గుర్తుచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఢిల్లీలో ఎన్డీఏ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేసినట్టు చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలను స్మార్ట్ పోల్స్ ముందే గుర్తించినట్లు పేర్కొన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు, బీహార్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే విజయం—ఈ రెండూ తమ సర్వేల ఖచ్చితత్వానికి నిదర్శనాలని అన్నారు.సమావేశానికి హాజరైన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జ్ అడ్డూరి శ్రీరామ్, స్మార్ట్ పోల్స్ ప్రతినిధులను అభినందిస్తూ, సంస్థ భవిష్యత్తులో మరిన్ని శ్రేష్ఠమైన సర్వేలు చేసి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నూకల నాగేశ్వరరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker