Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకాకినాడకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణదినఫలాలునందజ్యోతినంద్యాలనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్పల్నాడు

ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి : డాక్టర్ దిలీప్

ఉచిత పశు వైద్య శిబిరాలను రైతులు వినియోగించుకోవాలి

కారంపూడి మండలంలోని స్థానిక పట్టణం లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ దిలీప్ సోమవారం ఉచిత పశువైద్య శిబిరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కారంపూడి సర్పంచ్ సరస్వతి- బాలు నాయక్, కటికల బాలకృష్ణ, తండా మస్తాన్ జానీ పాల్గొన్నారు.. అనంతరం డాక్టర్ దిలీప్ పశువులను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి వచ్చే ఈనెల 31వ తేదీ వరకు ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. మండలంలో రోజుకు ఒక గ్రామంలో పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి పశువులు పెంచుకునే రైతులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పశు వైద్య సిబ్బంది,బోగ్గరపు . బ్రహ్మం పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button