ఆంధ్రప్రదేశ్

GUNTUR NEWS: త్వరలో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనుల ప్రారంభం

GUNTUR DEVELOPMENT WORKS

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విస్తృతంగా పర్యటించారు. త్వరలో శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనుల ప్రారంభం కానుండటంతో ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలను ఎమ్మెల్యే గళ్లా మాధవి, కమిషనర్ పులి శ్రీనివాసులు పరిసిలించారు.
అనంతరం ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ
శంకర్ విలాస్ బ్రిడ్జి విస్తరణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. దీని వలన వాహనదారులు ట్రాఫిక్ ను మళ్లించటం వలన అంతర్గత తీవ్ర అంతరాయం కలుగుతుందన్న భావనతో అంతర్గత రోడ్ల మీద ఆధారపడవలసివస్తుంది. ట్రాఫిక్ మళ్లింపు కోసం బ్రాడిపేట 14వ లైన్, కంకరగుంట ఆర్.యూ.బీ, పట్టాభిపురం పోలిస్ స్టేషన్ రోడ్డు, పట్టాభిపురం బ్రిడ్జి ప్రాంతాలను గుర్తించాము. ఈ ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్లను వేగంగా విస్తరించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం తప్పనిసరి కాబట్టి అవసరమైన ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగింపునకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే మాధవి, కమీషనర్ పులి శ్రీనివాసులు సూచించారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button