ఆంధ్రప్రదేశ్గుంటూరు

Guntur News: వెల్ఫేర్ సెంటర్ ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతి

CPI AGITATION

గుంటూరులోని కాకుమాను వారు తోటలో గల వెల్ఫేర్ సెంటర్ కు ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టడానికి అనుమతి ఇవ్వడంపై సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి హర్షం వ్యక్తం చేశారు. వెల్ఫేర్ సెంటర్లో హాస్పటల్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కోరుతూ శనివారం వెల్ఫేర్ సెంటర్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోట మాల్యాద్రి మాట్లాడుతూ నగర నడిబొడ్డులో గల 14 ఎకరాల కార్మిక శాఖ స్థలంలో గతంలో కార్మిక వర్గానికి వృత్తి నైపుణ్య శిక్షణను ఇచ్చేవారని కాలక్రమంలో ఆ ట్రైనింగ్ సెంటర్ మూసివేయటంతో అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారిందని పిచ్చి మొక్కలతో దట్టమైన అడవిని తలపిస్తూ చుట్టుపక్కల నివసిస్తున్న పేద ప్రజల ఇళ్లల్లోకి పాములు ఇతర విశ్వసర్పాలు రావటంపై అక్కడ జీవనం కొనసాగిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని వెల్ఫేర్ సెంటర్ ను పరిశుభ్రం చేసి హాస్పటల్ నిర్మాణం చేయాలని తెలిపారు. మిగిలిన స్థలాన్ని వాకింగ్ ట్రాక్ గా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం కోసం తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రహరీ గోడ తో పాటు వెల్ఫేర్ సెంటర్ ని పరిశుభ్రం చేసి అక్కడ హాస్పటల్ నిర్మాణాని త్వరితగతిన చేపట్టాలని మిగిలిన స్థలంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు రావుల అంజిబాబు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, సిపిఐ నాయకులు విరిగినేని వెంకటేశ్వరరావు, ఆ ప్రాంత ప్రజలు మేడసానికేశవ, కల్లూరి చిన్న తిరుపతిరావు, దూదిపల్లి శ్రీనివాసరావు, మాదాలకమలాకర్, కృష్ణయ్య, వెంకటేశ్వరరావు , దిలీపు, రమణ తదితరులు పాల్గొన్నారు.

Author

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button