Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్అమరావతి

Amaravathi news:గల్లంతైన బీసీ హాస్టల్ విద్యార్థి ఆచూకీ కనుక్కోండి – మంత్రి సవిత ఆదేశం

అమరావతి:01-11-25;-అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం బీచ్ వద్ద బీసీ హాస్టల్ విద్యార్థి గల్లంతు ఘటనపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.విద్యార్థి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించాలని జిల్లా కలెక్టర్‌ను, డీబీసీడబ్ల్యూను ఆమె ఆదేశించారు. ఈ మేరకు శనివారం మంత్రి సవిత ఒక ప్రకటన విడుదల చేశారు.పరవాడ మండలం తానం బీసీ హాస్టల్‌లో ఉంటూ రావికమతం మండలంలోని తోటవానిపాలెం గ్రామానికి చెందిన సూర్రెడ్డి భానుప్రసాద్ (10వ తరగతి) శుక్రవారం సాయంత్రం తుఫాన్ సెలవుల అనంతరం హాస్టల్‌కి తిరిగి వచ్చాడు. శనివారం ఉదయం హాస్టల్‌లో ఎఫ్ఆర్ఎస్ వేసి, తన స్నేహితులు ఎం. చందు (10వ తరగతి), ఎస్. రామచంద్ర (9వ తరగతి), పూర్వ బీసీ హాస్టల్ విద్యార్థి ఎన్. సిద్ధుతో కలిసి తానం ఉన్నత పాఠశాలకు వెళ్తున్నట్టు చెప్పి బయలుదేరాడు.

అయితే వారు స్కూల్‌కు వెళ్లకుండా ముత్యాలమ్మపాలెం బీచ్‌కు వెళ్లారు. స్నానానికి దిగబోతుండగా జాలర్లు సముద్రం ఉధృతంగా ఉందని హెచ్చరించినా, ఆ నలుగురూ స్నానానికి దిగారు. భారీ అలల ఉధృతికి లోనై లోపలికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన జాలర్లు చందు, రామచంద్ర, సిద్ధూలను కాపాడగా, భానుప్రసాద్ మాత్రం గల్లంతయ్యాడు.నాలుగు కోస్ట్ గార్డ్ బృందాలు, గజ ఈతగాళ్లు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి శ్రీదేవి మంత్రి సవితకు తెలిపారు.విద్యార్థి గల్లంతు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేస్తూ జిల్లా కలెక్టర్ విజయతో ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థి ఆచూకీ కోసం కోస్ట్ గార్డులు, గజ ఈతగాళ్ల సాయం తీసుకోవాలని, విద్యార్థి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలని ఆమె డీబీసీడబ్ల్యూవో శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకు ఆదేశాలు జారీ చేశారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button