chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

జిజిహెచ్‌ను సందర్శించిన కలెక్టర్‌ – వసతి గృహాల విద్యార్థుల ఆరోగ్యంపై సమీక్ష

గుంటూరు, అక్టోబరు 11:-గుంటూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జిజిహెచ్)ను శనివారం జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఆమె స్వయంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వైద్య సదుపాయాలను సమీక్షించిన కలెక్టర్, బీసీ వసతి గృహం విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా కలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి పర్యవేక్షకులు రమణ ఆమెకు తెలిపారు. అత్యవసర చికిత్సల కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ తక్షణ వైద్య సేవలు అందించాల్సిందిగా వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు.

ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించిన ఆమె, మరమ్మతుకు గురైన పరికరాలను తిరిగి ఉపయోగంలోకి తేవాలన్నారు.

ఇదిలా ఉంటే, జిల్లా సాంఘిక మరియు బీసీ సంక్షేమ అధికారి చెన్నయ్య మాట్లాడుతూ, అనపర్రు వసతి గృహంలో విద్యార్థులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. జిల్లాలోని మొత్తం 33 వసతి గృహాల్లో 24 వసతిగృహాల్లో ఇప్పటికే నీటి నమూనాల పరీక్షలు పూర్తయ్యాయని, మిగిలిన వసతిగృహాల్లో కూడా త్వరితగతిన పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు.

విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచే ప్రక్రియ పూర్తయిందని వివరించారు.

ఈ సందర్బంగా జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్‌తో పాటు ఇతర అధికారులు అనపర్రు గ్రామంలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులు, తాగునీటి వనరులను పరిశీలించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker