
బాపట్ల, అక్టోబర్ 12: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నేడు బాపట్ల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించబడుతోంది. ఇందులో భాగంగా, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐఏఎస్ ఆధ్వర్యంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుండి నేరుగా ఫిర్యాదుల అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా కలెక్టరేట్తో పాటు, ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో మరియు మండల తహశీల్దార్ కార్యాలయాలలో కూడా తహశీల్దార్లు, ఎంపీడీవోలు ప్రజల నుండి సమస్యల అర్జీలు స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చిన వారు తమ సమస్యల పరిష్కార స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చని, లేదా meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా కూడా తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని సూచించారు.ఈ కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుని తమ సమస్యలకు పరిష్కారాన్ని పొందాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.







