
కర్లపాలెం:నల్లమోతువారిపాలెం:నవంబర్ 22:-గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) అమలు విధానంపై గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యేక గ్రామసభ జరిగింది. ఈ సమావేశంలో పథకం ప్రయోజనాలు, గ్రామాభివృద్ధికి దోహదపడే విధానంపై వివరించినట్లు సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు, రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు.

గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే గ్రామస్థులకు మాత్రమే కాకుండా గ్రామ అభివృద్ధికీ ఎంతగానో ఉపయోగం ఉంటుందని ఆయన గుర్తు చేశారు. పథకంలో పారదర్శకత కోసం ప్రస్తుతం ఉన్న జాబితాను సవరించి, మరణించినవారి పేర్లు, అనర్హుల వివరాలు తొలగిస్తూ అర్హులైన వారికి అవకాశం కల్పించేందుకు గ్రామసభ ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నట్లు ఎంపీటీసీ పేర్కొన్నారు.గ్రామసభకు సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం, సెక్రటరీ షేక్ షాహినా, టీడీపీ ఇంచార్జి మునిపల్లె చిన్న, గ్రామ పెద్దలు మాడా శ్రీనివాసరావు, జనసేన శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యార







