Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

Guntur Local News:జీఎస్టీ 2.0తో పేద, మధ్య తరగతి వారికి భారీ ఊరట: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, అక్టోబర్ 13:గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో సోమవారం నిర్వహించిన “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి, పలు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వల్ల ఏర్పడిన ధరల తేడాను పరిశీలించారు.

Guntur Local News:జీఎస్టీ 2.0తో పేద, మధ్య తరగతి వారికి భారీ ఊరట: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్యే గల్లా మాధవి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 పన్ను సంస్కరణలు పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.“ఇప్పటి వరకూ నాలుగు స్లాబ్‌లలో (5%, 12%, 18%, 28%) అమలులో ఉన్న జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం రెండు స్లాబ్‌లకే పరిమితం చేసింది. అందులో 99 శాతం నిత్యవసర వస్తువులు 5 శాతం స్లాబ్‌లోకి రావడంతో ప్రజలకు నేరుగా ధరల తగ్గింపు లభిస్తోంది,” అని తెలిపారు.

అంతేకాకుండా, ఆరోగ్య బీమాపై పన్నును పూర్తిగా తొలగించడం వల్ల వైద్య ఖర్చులు తగ్గి సామాన్యులకు మేలు జరుగుతోందన్నారు. ఇది నిజమైన ప్రజానుకూల నిర్ణయమని ఆమె అభిప్రాయపడ్డారు.“వినియోగదారులు పాత ధరలు కాకుండా తాజా జీఎస్టీ రేట్ల ప్రకారం వస్తువులు కొనుగోలు చేస్తున్నారా అన్నది ప్రతి ఒక్కరూ తన స్థాయిలో చూసుకోవాలి. అవగాహన కలిగిన వినియోగదారుడే బలమైన ఆర్థిక వ్యవస్థకు పునాదిగా నిలుస్తాడు,” అని గల్లా మాధవి సూచించారు.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న ఈ సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రతి కుటుంబం ఆర్థికంగా లాభపడేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button