chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

chilakaluripeta news:గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయాలి – సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్

చిలకులూరిపేట:09-11-25:-పట్టణంలోని పాత నేషనల్ హైవేతో పాటు వివిధ రహదారులపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు ప్రమాదకరంగా మారాయని, వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టాలని సామాజికవేత్త మాదాసు భాను ప్రసాద్ డిమాండ్‌ చేశారు.ఈరోజు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “గతంలో తెలంగాణలో చేవెళ్ల వద్ద నాలుగు అడుగుల గుంత కారణంగా కంకర టిప్పర్‌, ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మరిచిపోరాదు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే పట్టణంలో గుంతలు పడిన రోడ్లను తక్షణమే మరమ్మత్తు చేయాలి” అని అన్నారు.

వాడరేవు–నకరికల్లు హైవేలో పసుమర్రు, ఇంజనంపాడు ప్రాంతాల వద్ద ఉన్న డిజైన్‌ లోపాన్ని వెంటనే సరిచేసి, అవసరమైన చోట అండర్‌పాసులు నిర్మించాల్సిందిగా ఆయన అధికారులను కోరారు.మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని, కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు దహన ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరికీ హెచ్చరిక కావాలని ఆయన పేర్కొన్నారు.అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, రాష్‌ డ్రైవింగ్‌, త్రిబుల్‌ రైడింగ్‌లను అరికట్టేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.“కొంతమంది ఆకతాయిలు రాత్రివేళల్లో నేషనల్‌ హైవేపై రైడింగ్‌ పోటీలు నిర్వహిస్తున్నారంటే వారి బరితెగింపు ఎటువంటి స్థాయిలో ఉందో అధికారులు ఆలోచించాలి. నెంబర్‌ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల సమయంలో బాధితులు ఫిర్యాదు చేయడమే కష్టమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందో అధికారులే సమాధానం చెప్పాలి,” అని మాదాసు భాను ప్రసాద్ ప్రశ్నించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker