సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని వామపక్ష పార్టీలు ఖండించాయి. ఈమేరకు సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో గుంటూరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి, ఆకిటి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సర్వోన్నత న్యాయస్థానం ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా లాయర్ రాకేష్ కిషోర్ ప్రవర్తించారని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగింది కనుక సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బాధ్యుడుపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
1,002 Less than a minute