
గుంటూరు రూరల్ మండలం పరిధి జూనం చుండూరు గ్రామంలో దసరా పండుగ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. పురాతనమైన సమ్మోహన వేణుగోపాల స్వామివారి దేవాలయంలో వేడుకగా దసరా సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. యువకులు1500సం. ల పూర్వ చరిత్ర కలిగిన సమ్మోహన వేణుగోపాల స్వామికి ఈ గ్రామంలో సంప్రదాయ బద్దంగా ప్రతి ఒక్కరు పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి పండుగకు స్వామివారిని గ్రామోత్సవానికి ఊరేగింపుగా గోవిందనామాలు చెబుతూ వీధి వీధినా యువకులు భుజాలపై మోస్తూ ఊరేగింపు నిర్వహిస్తారు. స్వామివారి అనుగ్రహంతో పాడిపంటలు కొదువలేకుండా ఉందని అందుకనే ఘనమైన భక్తి భావంతో వేడుకలు నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు. గ్రామంలో ఎంతోమంది విద్యార్థులు స్వామివారి సేవలలో పాల్గొని ఉన్నత ఉద్యోగాలు, ఉన్నత విద్యలకు వెళుతున్నారని ఆనందంతో యువత చెప్పడం ఇక్కడ గమనించదగ్గ విషయం. మాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా స్వామివారి దర్శనం చేసుకొని వెళితే అన్ని సవ్యంగా జరిగిపోతాయని, స్వామివారి దేవాలయం పునర్నిర్మాణం జరిగిన తరువాత మా గ్రామం ఎంతో అభివృద్ధి పథంలో దూసుకు పోుందని వారు వెల్లడించారు.







