Trendingఅనకాపల్లిఅనంతపురంఅన్నమయ్యఅమరావతిఅల్లూరి సీతారామరాజుఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్ఎన్టీఆర్ విజయవాడఏలూరుకర్నూలుకృష్ణాకోనసీమగుంటూరుచిత్తూరుజాతీయ వార్తలుటెక్నాలజితిరుపతితూర్పుగోదావరితెలంగాణనెల్లూరుపల్నాడుపశ్చిమగోదావరిప్రకాశంబాపట్లమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవిజయనగరంవిశాఖపట్నంవీడియోలువెదర్ రిపోర్ట్వైయస్సార్ కడపశ్రీకాకుళంశ్రీసత్యసాయిస్పోర్ట్స్
గుంటూరుఆంధ్రప్రదేశ్

GUNTUR: త్వరలో విశాఖ ఉక్కు ఉద్యమం

CPI LEADERS PRESS MEET

అందరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా మహా సభలు జయప్రదం అయ్యాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. త్వరలో చండీఘర్ లో జాతీయ స్థాయి మహా సభలు జరగనున్నాయని వారు వెల్లడించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యలపై జాతీయ మహా సభల్లో సుదీర్ఘంగా చర్చించి పోరాటాలకు రూపకల్పన చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొల్లగొడుతున్నాడని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని చెప్పారు. ఇందుకోసం ఈనెల 28వ తేదీన ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు వలి, ఏఐఎస్ఎఫ్ నాయకులు చైతన్య పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker