chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR: పెట్టుబడులు తగ్గాలి – లాభదాయకత పెరగాలి

GUNTUR COLLECTOR MEETING ON AGRICULTURE

వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు తగ్గాలని, రైతులకు లాభదాయకత పెరగాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాథమిక రంగాల శాఖలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక రంగాల శాఖలు నూతన ఆవిష్కరణలు దిశగా అడుగులు వేస్తూ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో లాభదాయకత పెరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక రంగాల్లో ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా పరిశీలించాలని సూచించారు. ఏ అంశాన్ని సాధారణంగా తీసుకోరాదని, భవిష్యత్తులో అవసరాలను ముందుగా గుర్తించాలని స్పష్టం చేశారు. శాఖలకు సంబంధించి సమయానుసారం పురోగతి తెలియజేయాలని ఆదేశించారు. పంటల విధానం (క్రాప్ పాటర్న్)మ్యాపింగ్ ను తయారు చేయాలని ఆదేశించారు. ఉత్తమ విధానాలను డాక్యుమెంట్ చేయాలని అన్నారు. స్థూల విలువ ఆధారిత పెంపుకు అవకాశాలు పెంపుదలకు కృషి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అయితా నాగేశ్వర రావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖకు 43 సూచికలు ఉన్నాయన్నారు. రైతు సేవా కేంద్రాల స్థాయిలో లక్ష్యాలను నిర్దేశించడం జరిగిందన్నారు. వ్యవసాయ ఉత్పాదకత, విస్తరణ రంగాల్లో అధిక దృష్టి సారించడం జరిగిందన్నారు. ప్రతి పంట వారిగా ఉన్న సమస్యలను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుత ఏడాది శత శాతం లక్ష్యాలు సాధించే దిశగా చర్యలు చేపట్టామని వివరించారు. రైతులు మొక్క జొన్న, మినప పంటలకు మారుతున్నారని చెప్పారు. పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు కె.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ విజన్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా మాంసం, పాలు, గుడ్లు ఉత్పాదకత పెంపుకు దృష్టి సారిస్తున్నామన్నారు. కృత్రిమ గర్భధారణ పద్ధతులను ప్రోత్సహించడం జరుగుతోందని చెప్పారు. పశుదాన పెంపుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళిక అధికారి శేష శ్రీ, జిల్లా మత్స్య శాఖ అధికారి పి.ఎన్.కిరణ్ కుమార్, జిల్లా అటవీ అధికారి, జలవనరులు శాఖ పర్యవేక్షక ఇంజనీర్, భూగర్భ జలవనరులు శాఖ, ఉద్యాన శాఖ ఉప సంచాలకులు, ఏపి ఎం.ఐ.పి, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker