Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR: ప్రకృతి వ్యవసాయం విస్తరణకు సమిష్టి కృషి

AGRICULTURE MEETING IN GUNTUR WITH BRAZIL DELIGATS

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం విజయవంతం అయ్యే ప్రక్రియలో ప్రభుత్వ అంకితభావం, శాస్త్రీయ ప్రమాణాలు, రైతు సాధికార సంస్థ (RySS) వంటి ప్రత్యేక సంస్థల ఏర్పాటు, దశాబ్దాలుగా కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాల భాగస్వామ్యం ద్వారా వచ్చిన మహిళా సాధికారత అని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో 40 శాతం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. GUNTUR NEWS.:లభించిన బాలు మృతదేహం..

బ్రెజిల్ ప్రతినిధులతో సోమవారం గుంటూరులోని ఒక ప్రైవేట్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గత రెండు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన బ్రెజిల్, యూఏఈ, శ్రీలంక దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు తమ అనుభవాలు, పరిశీలించిన అంశాలను ఈ సమావేశంలో పంచుకున్నారు. ప్రకృతి వ్యవసాయంలో వస్తున్న సానుకూల మార్పు, ముఖ్యంగా మహిళలు పోషిస్తున్న క్రియాశీలక పాత్రను బృంద సభ్యులు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా శ్రీ రాజశేఖర్ మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF) విధానం పాత పద్ధతులకు తిరిగి వెళ్లడం కాదని, నిరంతరం అభివృద్ధి చెందుతూ రసాయన వ్యవసాయానికి సవాల్ గా మారిన శాస్త్రీయ విధానమని పేర్కొన్నారు. Guntur: ఒకే ఒక్కడు…. 50 బైక్ లు ఎత్తుకెళ్లాడు

సృజనాత్మకతతో కూడిన ప్రకృతి వ్యవసాయం స్థిరమైన, పునరుత్పత్తి చేయగల పరిష్కారాలను అందిస్తోంది” అని అన్నారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహం అత్యవసరమని, రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 40% భూభాగం ప్రకృతి వ్యవసాయం కిందకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన తెలిపారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button