
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈమేరకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. గాంధీజీ చూపిన అహింసా మార్గం ప్రపంచానికే స్ఫూర్తి. హింసతో ఏ సమస్యా పరిష్కారం కాదని, శాంతియుత పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం సాధ్యమని ఆయన నిరూపించారు. గాంధీజీ ఆశయాలు చిరస్మరణీయాలు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛత సమాజం కోసం మనమంతా కృషి చేయాలి. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాలతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి సాదాసీదా జీవనశైలి, దేశభక్తి అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ‘జై జవాన్ – జై కిసాన్’ నినాదంతో ఆయన దేశానికి నూతన దిశ చూపించారని, దేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి కోసం పోరాడిన మహనీయుల త్యాగాలకు మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.







