గుంటూరుఆంధ్రప్రదేశ్
Guntur : A mediation center has been opened at the Legal Services Authority office in the district court.
జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ కార్యాలయం వద్ద మధ్యవర్తిత్వ కేంద్రం ప్రారంభమైంది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా హాజరై మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. 90 రోజుల మధ్యవర్తిత్వ కార్యక్రమంలో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కక్షిదారులు తమ సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జియావుద్దీన్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.