chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 మహబూబ్‌నగర్ జిల్లా📍 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

గుంటూరు అన్నక్యాంటీన్లపై కమిషనర్ ప్రత్యేక దృష్టి

గుంటూరు, అక్టోబర్ 6 : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న అన్నక్యాంటీన్లలో ఆహార సరఫరా సమయాలను పర్యవేక్షించేందుకు వార్డ్ సచివాలయ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించినట్లు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.

సోమవారం అమరావతి రోడ్డులోని అన్నక్యాంటీన్‌ను స్వయంగా సందర్శించిన కమిషనర్, అక్కడ భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ప్రతి రోజు ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అన్నక్యాంటీన్లలో ఆహారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. మౌలిక వసతులు మెరుగ్గా ఉండాలి. ప్రత్యేకించి త్రాగునీరు, శుభ్రతపై దృష్టి సారించాలి. క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో అలసత్వం సహించం,” అని తెలిపారు.

కేటాయించిన కార్యదర్శులు నిర్దేశిత సమయంలో క్యాంటీన్‌ వద్ద ఉంటూ, ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker