Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలి

GUNTUR COMMISSIONER VISIT SANITATION

నగర స్వచ్ఛతలో ప్రతి పౌరుడి పాత్ర ఎంతో ముఖ్యమని, ప్రతి ఇంటి నుండి వచ్చే వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. బుధవారం కమిషనర్ రెడ్డిపాలెం, విజయపురి కాలనీ, అన్నపూర్ణ నగర్, హిమని నగర్, టెలికాం నగర్, రెడ్డిపాలెం, అరండల్ పేట ప్రాంతాల్లో పారిశుధ్యం, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత రెడ్డిపాలెంలో స్థానికులతో మాట్లాడుతూ వ్యర్థాలను వేరు చేయడం ద్వారా రీసైక్లింగ్, కంపోస్టింగ్ వంటి పద్ధతులు సులభమవుతాయని, తద్వారా నగరంలో చెత్త నిల్వ సమస్యలు తగ్గుతాయన్నారు. ప్రజారోగ్య కార్మికులు కూడా తమకు కేటాయించిన మైక్రో ప్యాకెట్ల వారీగా అన్ని ఇళ్ల నుండి నూరు శాతం చెత్త సేకరణ చేయాలన్నారు. చెత్త సేకరణ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని పర్యవేక్షణ మెరుగ్గా చేయాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లకు స్పస్టం చేశారు. అనంతరం అరండల్ పేట మెయిన్ రోడ్ లో డ్రైన్ భవన వ్యర్ధాలతో నిండి ఉండడం గమనించి తక్షణం తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఎం.బుక్ మేరకు పరిశీలించి, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పనులు ప్రారంభం నుండి మెరుగైన పర్యవేక్షణ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తైన వెంటనే నిర్దేశిత విధానంలో ఎం.బుక్ రికార్డ్ చేయాలన్నారు. పర్యటనలో డిఈఈ రమేష్, ఎస్ఎస్ లు ప్రసాద్, ఐజాక్, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్, ప్రజారోగ్య అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button