chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

GUNTUR COMMISSIONER MEETING ON DEVELOPMENT PROGRAMMES

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయంలో నిర్దేశిత ప్రమాణాల మేరకు క్యూరింగ్ జరిగేలా ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ ఏఈలు, డిఈఈలు, ఈఈలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, సిసి రోడ్లు, డ్రైన్లను ఎంతో ఖర్చుతో నిర్మాణం చేస్తున్నామని, వాటిని నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ చేయకుంటే ప్రజాధనం వృధా అవుతుందన్నారు. కనుక పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు తప్పనిసరిగా అక్కడే ఉండి పర్యవేక్షణ చేయాలన్నారు. నాణ్యత కల్గిన మెటీరియల్ వినియోగం, క్యూరింగ్ పై ద్రుష్టి పెట్టాలన్నారు. నూతన రోడ్ల ప్రతిపాదనల్లో ఎండ్ టు ఎండ్ ఉండేలా చూడాలన్నారు. పనులు పూర్తైన వెంటనే తమ ఇన్స్పెక్షన్ అనంతరం బిల్లుల చెల్లింపు కోసం నిధి పోర్టల్లో అప్ లోడ్ చేయాలన్నారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ అనంతరం సదరు కాంట్రాక్టరే నిర్మాణ వ్యర్ధాలను తొలగించాలని స్పష్టం చేశారు. ఏఈల వారీగా అభివృద్ధి పనులకు సంబంధించి టెండర్ పొందినవి, ప్రారంభించినవి, ప్రారభించనవి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని హెచ్ డీని ఆదేశించారు. అనంతరం త్రాగునీటి సరఫరాపై సమీక్షించి, ఏఈలు, ఎమినిటి కార్యదర్శులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఫిర్యాదులు అందితే డిఈఈలు నేరుగా ప్రత్యక్ష పరిశీలన చేసి పరిష్కారం చేయాలన్నారు. నగరంలో నూతనంగా నిర్మాణం చేయనున్న రిజర్వాయర్లు, యూపిహెచ్ లకు ఈ నెల 21న కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంఖుస్థాపన చేస్తారని, అందుకు స్థానిక ఎమ్మేల్యేలు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని ఈఈలను ఆదేశించారు.సమావేశంలో ఎస్ఈ (ఇంచార్జి) సుందర్రామిరెడ్డి, ఈఈలు కోటేశ్వరరావు, విష్ణు, వేణు గోపాల్, అసిస్టెంట్ ఎగ్జామినర్ తిరుపతయ్య, డిఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker