
గుంటూరు నగర పాలక సంస్ధ హెడ్ వాటర్ వర్క్స్ పంపింగ్ రిజర్వాయర్ కి వెళ్లే ప్రధాన పైప్ లైన్ పై ఏర్పడిన లీకు మరమత్తుల కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం నుండి హెడ్ వాటర్ వర్క్స్ ఫిల్టరేషన్ పాయింట్ ని నిలిపి వేయడం జరుగుతుందని, దీని వలన 20 నుండి 22వ తేదీ వరకు నగరంలో త్రాగునీటి సరఫరాకి అంతరాయం కల్గుతుందని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. Doctor: పుట్టిన బిడ్డల ఆరోగ్యం & సంరక్షణ — తల్లిదండ్రులకు తప్పక తెలుసుకోవాల్సిన పూర్తి మార్గదర్శకం: Newborn Care Explained by Specialist –K.RAMBABU Journlist Exclusive Health Talk” -Dr. Mahesh Choudary Athota Consultant,Paediatric & Neonatology,MBBS, MD, Fellowship in Neonatology :
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ లో ఏర్పడిన పైప్ లైన్ లీకు వలన త్రాగునీటి వృధా జరుగుతుందని, లీకు మరమత్తు అత్యవసరమన్నారు. మరమత్తు పనుల వలన నగరంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, హనుమయ్య నగర్, స్తంభాల గరువు, శ్యామల నగర్, గుజ్జనగుండ్ల, కోర్ట్ కాంపౌండ్, ఏటి అగ్రహారం, మార్కెట్ యార్డ్, హౌసింగ్ బోర్డ్, బిఆర్ స్టేడియం, నల్లచెరువు, శ్రీనివాసరావుతోట, కెవిపి కాలనీ, రాజీవ్ గాంధీ నగర్, తారకరామ నగర్ రిజర్వాయర్ల పరిధిలో 20వ తేదీ నుండి 22వ తేదీ ఉదయం వరకు త్రాగునీటి సరఫరా జరగదని, 22వ తేదీ సాయంత్రం పాక్షికంగా,
ఆదివారం ఉదయం నుండి యధావిధిగాసరఫరా జరుగుతుందని తెలిపారు. కావున నగర ప్రజలు గుంటూరు నగరపాలక సంస్ధకు సహకరించి ముందుగా తగిన ఏర్పాట్లు చేసుకొనవలసినదిగా కోరడమైనది.










