Trendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: గుంటూరులో ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

ABUL KALAM AZAD BIRTH ANNIVERSARY

భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతిని గుంటూరు నగర వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆజాద్ సేవలను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ, “మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ నిర్మాణంలో, మరీ ముఖ్యంగా విద్యా వ్యవస్థ బలోపేతంలో చేసిన కృషి అద్వితీయమైనది” అని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగంలో ప్రవేశపెట్టిన విప్లవాత్మకమైన సంస్కరణలను, ‘నాడు-నేడు’, ‘అమ్మఒడి’ వంటి పథకాల ద్వారా పేద విద్యార్థులకు అందించిన మేలును ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button