chennaiTrendingఅమరావతిఆధ్యాత్మికంఆంధ్రప్రదేశ్ఆరోగ్యంఎడ్యుకేషన్జాతీయ వార్తలుటెక్నాలజితెలంగాణదినఫలాలునందజ్యోతిమాసఫలాలుమూవీస్/గాసిప్స్రాశి ఫలాలువాతావరణంవార్షిక ఫలాలువీడియోలువెదర్ రిపోర్ట్స్పోర్ట్స్📍 అనంతపురం జిల్లా📍 కామారెడ్డి జిల్లా📍 జగిత్యాల జిల్లా📍 నల్గొండ జిల్లా📍 నిజామాబాద్ జిల్లా📍 నిర్మల్ జిల్లా📍 పల్నాడు జిల్లా📍 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా📍 యాదాద్రి భువనగిరి జిల్లా📍 రంగారెడ్డి జిల్లా📍 విజయవాడ ఎన్టీఆర్ జిల్లా📍 విశాఖపట్నం జిల్లా📍 శ్రీకాకుళం జిల్లా📍 సికింద్రాబాద్📍 హనుమకొండ జిల్లా📍 హైదరాబాద్ జిల్లా📍అనకాపల్లి జిల్లా📍అన్నమయ్య జిల్లా📍అల్లూరి సీతారామరాజు జిల్లా📍ఎలూరు జిల్లా📍కడప జిల్లా (వై.ఎస్.ఆర్. జిల్లా)📍కర్నూలు జిల్లా📍కృష్ణా జిల్లా📍కోనసీమ జిల్లా📍గుంటూరు జిల్లా📍చిత్తూరు జిల్లా📍తిరుపతి జిల్లా📍తూర్పు గోదావరి జిల్లా📍నంద్యాల జిల్లా📍నెల్లూరు జిల్లా (శ్రీ పొట్టి శ్రీరాములు)📍పశ్చిమ గోదావరి జిల్లా📍ప్రకాశం జిల్లా📍బాపట్ల జిల్లా📍విజయనగరం జిల్లా📍శ్రీ సత్యసాయి జిల్లా
ఆంధ్రప్రదేశ్📍గుంటూరు జిల్లా

GUNTUR CITY NEWS: గుంటూరులో పచ్చదనం పెంచేందుకు చర్యలు

GUNTUR COMMISSIONER VISIT DEVELOPMENT PROGRAM

గుంటూరు నగరంలో విస్తృతంగా నాటుతున్న మొక్కలను పరిరక్షించడంలో పార్క్ సిబ్బంది, కార్మికులు భాధ్యతగా ఉండాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం పట్టాభిపురం, బ్రాడీపేట, నెహ్రూ నగర్, కొత్తపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుకై వార్డ్ ల వారీగా డివైడర్లు, రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో విరివిగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. నూతనంగా నిర్మాణం చేసే రోడ్ల పక్కన మొక్కలు నాటెందుకు వీలుగా రింగ్స్ కూడా ఏర్పాటు ౠ పేర్కొన్నారు. మొక్కలకు ప్రతి రోజు నీరు పోయడం, డివైడర్లోలోని పిచ్చి మొక్కలను శుభ్రం చేస్తూ పచ్చదనంను పెంచడానికి పార్క్ కార్మికులు, సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. పట్టాభిపురం రోడ్ ఆక్రమణలను గమనించి, వాటి పట్ల ఉదాశీనత పనికిరాదని, తక్షణం తొలగించాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శంకర్ విలాస్ వంతెన పనుల వలన పెరుగుతున్నట్రాఫిక్ సమస్య ఆక్రమణల వలన మరింత జటిలంగా మారుతుందన్నారు. ప్రజారోగ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో కార్యదర్శులు క్షేత్ర స్థాయిలో ఉండడం లేదని గమనిస్తున్నామని, శుక్రవారం నుండి అలా గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. లాడ్జి సెంటర్ నుండి ఎల్ఈఎం స్కూల్ కి వెళ్లేదారిలో చేపట్టిన ఫ్లేవర్డ్ బ్లాక్స్ ఏర్పాటు పనులు మందకొండిగా సాగడం, క్యూరింగ్ చేయకపోవడంపై ఇంజినీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి, 2 రోజుల్లో పనులు పూర్తి కావాలని ఆదేశించారు. నెహ్రూ నగర్ రిజర్వాయర్ త్రాగునీటిలో క్లోరిన్ తనిఖీ చేసి, రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని, చేసిన, తదుపరి చేయాల్సిన తేదీలతో బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నాజ్ సెంటర్ లోని పబ్లిక్ టాయ్ లెట్స్ ని తనిఖీ చేసి, పరిశుభ్రంగా నిర్వహించాలని, ఫిర్యాదుల పుస్తకం పెట్టాలన్నారు. పర్యటనలో ఈఈ వేణుగోపాల్, డిఈఈలు కళ్యాణరావు, హనీఫ్, ఎస్ఎస్ లు ప్రసాద్, సాంబయ్య,ఇంజినీరింగ్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక అధికారులు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button

Adblock Detected

Please Disable the Adblocker